Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల సవరణ షెడ్యూ ల్లో ఎస్జీటీల వెబ్ఆప్షన్ల గడువు నాలుగు రోజుల నుంచి రెండు రోజులకు కుదించడం దేనికి సంకేత మని ఎస్టీయూటీఎస్ ప్రశ్నించింది. ఈ మేరకు ఎస్టీ యూటీఎస్ అధ్యక్షుడు బి భుజంగరావు, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 75,317 మంది ఉపాధ్యా యులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుంటే, ఎస్జీటీ, సమాన స్థాయి ఉపాధ్యాయులు 41,045 మంది ఉన్నారని తెలిపారు.
ఖాళీలు ఎంచుకోవడం, వెబ్ఆప్షన్లు వేల సంఖ్యలో ఇచ్చుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. ఎస్జీటీలకు వెబ్కౌన్సెలింగ్ కాకుండా మాన్యువల్ పద్ధతిలో బదిలీల ప్రక్రియ జరపాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీనియార్టీ జాబితా ప్రకటి స్తామని ఉందని, కానీ తప్పులను సవరిం చుకోవడానికి కనీసం ఒకరోజైనా గడువుండాలని కోరారు.
సీఎం జోక్యం చేసుకోవాలి : పీఆర్టీయూ
ఉపాధ్యాయ బదిలీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి చెన్నకేశవరెడ్డి గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల బది లీలపై గందరగోళ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పారదర్శకంగా బదిలీలు జరిగే అవకాశం లేదని తెలి పారు. ఉపాధ్యాయులు వెబ్కౌన్సెలింగ్ ద్వారా ఆప్షన్లు ఎంచుకోవడం గందరగోళానికి కారణమవుతోందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల వెబ్కౌన్సె లింగ్ నిర్వహణలో విఫలమైందని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలను మాన్యువల్గా జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఆందోళనలో టీచర్లు : డీటీఎఫ్
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఉపా ధ్యాయులు ఆందోళనలో ఉన్నారని డీటీఎఫ్ అధ్య క్షుడు ఎం రఘుశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అధిక సంఘాలు వ్యతిరేకించినా వెబ్కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిం దని పేర్కొన్నారు. వెబ్ఆప్షన్ల నమోదు ప్రారంభానికి ఒక రోజే ఉన్నా డెమో నిర్వహించడంపై వాయిదా వేస్తున్నారని తెలిపారు. దీంతో వెబ్కౌన్సెలింగ్పై అనేక అనుమానాలు వస్తున్నాయని, ఇది విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అధిక సంఖ్యలో ఉన్న ఎస్జీటీలకు వెబ్కౌన్సెలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చి మాన్యువల్గా నిర్వహించాలని కోరారు.