Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హమాలీ కార్మికు లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమ య్యాయని సీఐటీయూ కార్యదర్శి పి.సుధాకర్ తెలిపారు. నిరవధిక సమ్మె ప్రారంభించిన రెండో రోజు గురువారం నాడు పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ అకున్ సబర్వాల్, ఇతర అధికారులు, వివిధ కార్మిక సంఘాల నాయకత్వం సమక్షంలో చర్చలు జరిగాయని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత రేట్లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.15 నుండి రూ.18.50, రాష్ట్రంలో రూ.15 నుండి రూ.18 పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. నాలుగేండ్లుగా పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ సౌకర్యాన్ని 2018 నుండి అమల్లోకి వస్తుందని మంత్రి ప్రకటించారని తెలిపారు. కార్మికుడికి ప్రమాద బీమా రూ.6 లక్షలు, బోనస్ యూనిఫాం వంటి సమస్యలను పరిష్కారమని హామీనిచ్చారని పేర్కొన్నారు. చర్చల్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, సుధాకర్, మాదిరెడ్డి అంజిరెడ్డితోపాటు ఏఐటీయూసీ కార్యదర్శి బాల్రాజ్, టీఆర్ఎస్కేవీ నుండి రామయ్య, తిరుపతి, సీహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.