Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీపై కేసీఆర్ వైఖరి స్పష్టం చేయాలి: సీపీఐ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
జులై చివరి వారంలో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తెలిపారు. టీజేఎస్, టీడీపీ, వామపక్షాలు, బీసీ సంఘం, ఎంఆర్పీఎస్ తదితర సంఘాలతో సంప్రదిం పులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలను ఓడించడమే లక్ష్యంగా ముందుకు పోతామ న్నారు. అయితే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసే విషయాన్ని మాత్రం దాటవేశారు. గురువారం మగ్ధుంభవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు శ్రీనివాస్రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ఓడించేందుకు వామపక్షాల బలం సరిపోదనీ, అందుకే ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీపీఐతో కలిసి పనిచేసేందుకు టీజేఎస్ సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్..బీజేపీపై తన వైఖరి స్పష్టం చేయాలని కోరారు. ఫెడరల్ ఫ్రంట్ పెడతానని చెప్పి, పలు రాష్ట్రాలు పర్యటించారనీ, ఫ్రంట్ ఎంతవరకూ వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధర్నా చేస్తుంటే, ఢిల్లీలో ఉండి కూడా కనీసం ఆయనను పరామర్శించలేదని మండిపడ్డారు. బీజేపీ ఏజెంట్గా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. భూప్రక్షాళన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందనీ, ప్రభుత్వ అధికారులు అక్రమాలకు పడుతున్నా, కనీసం వారిపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.