Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 వేల టీఎంసీల నీరు నింపుతాం : మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
మిడ్ మానేరు రిజర్వాయర్ ద్వారా 76 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఈ ఏడాది ఈ రిజర్వాయర్లో 25 టీఎంసీల నీరు నింపుతామని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాజెక్టు ఇంజినీర్లు, సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. గత ఏడాది మిడ్ మానేరులో 5 టీఎంసీల నింపామని చెప్పారు. ఈ సంవత్సరం సకాలంలో నీరందించేందుకు ఇంజినీర్లు సంసిద్ధంగా ఉండాలని ఆయన ఆదేవించారు. ప్రాజెక్టు గేట్లన్నీ పనిచేసేలా చూడాలన్నారు. ఫ్లడ్కంట్రోల్ రూం పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు పరిధిలో ప్యాకేజీల వారీగా పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. లింక్ కెనాల్లో అక్విడిక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లింక్ కెనాల్ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కాంట్రాక్టర్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. వందమంది కూలీలను అదనంగా నియమించాలన్నారు. మిడ్ మానేరు ద్వారా ఎన్ని చెరువులు నింపవచ్చో ఆ వివరాలు పంపాలన్నారు. చుక్క నీరు వ్యర్థం కాకుండా చెరువుల ద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. పునరావాస చర్యల కోసం 33 కోట్లకు అనుమతి రాలేదని అధికారురలు మంత్రి దృష్టికి తెచ్చారు. అప్పటి కప్పుడు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి అనుమతుల ప్రక్రియను మంత్రి పూర్తి చేయించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు పరిధిలో ఆర్ అండ్ ఆర్ కాలనీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన పాఠశాలలు, రోడ్లు, విద్యుత్, నీరు వంటి సదుపాయాలను కల్పించాలన్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలు సందర్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జేసీలను మంత్రి ఆదేశించారు. అనంతగిరి రిజర్వాయర్ పనులపైన సమీక్ష జరిపారు. రిజర్వాయర్ పరిధిలో 102 ఎకరాల భూసేరణ మిగిలి ఉందని, దీన్ని పూర్తి చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. పునరావాస చెల్లింపులు త్వరగా జరిగేలా చూడాలని సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, జిల్లా కలెక్టర్ క ష్ణ భాస్కర్ కు సూచించారు. త్వరలో నీరు రిజర్వాయర్ కు వచ్చే అవకాశం ఉందన్న మ0త్రి. అందుకు తగ్గట్టుగా రిజర్వాయర్ కాలువ పనులు వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు పనుల్లో చొరవ చూపినందుకు కలెక్టర్ ను, ఇతర సిబ్బందిని మంత్రి అభినందించారు.
ఆదిలాబాద్ ప్రాజెకులపై సమీక్ష..
ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చనాకా-కొరాటా, కొమురం భీం, రాలివాగు, గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథపూర్, మత్తడివాగు, సాత్నాల, స్వర్ణ, గడ్డన్నవాగు, ఎన్టీఆర్ సాగర్, వట్టివాగు ప్రాజెక్టుల నిర్మాణం, భూసేరణ గురించి మంత్రి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్యాకేజీల వారీగా మంత్రి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి జోగు రామన్న, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల కలెక్టర్లు, ఇంజినీర్లు పాల్గొన్నారు. చనాకా, కొరాట ప్రాజెక్టు పనులు అక్టోబర్ నాటికి పూర్తి 13 వేల ఎకరాలకు సాగునీరందించాలని మంత్రి ఆదేశించారు.