Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పులు సవరించాలని 'వేములఘాట్' నిర్వాసితుల డిమాండ్
నవతెలంగాణ- తొగుట
భూముల విషయంలో తప్పులను సవరించి, అభ్యంతరాలను పరిష్క రించిన తర్వాతే విచారణ చేపట్టాలని సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ భూ నిర్వాసితులు పబ్లిక్ అవార్డు విచార ణను బహిష్కరిం చారు. గురువారం వేములఘాట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేక భూసేకరణ అధికారి, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిం చారు. గ్రామస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దీనిపై ఆగ్రహించిన గ్రామస్తులు సభను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. తాము గతంలో ఇచ్చిన వివిధ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలన్నారు. చట్టప రంగా కాకుండా ఇష్టారీతిగా పత్రాలు పడేసి, సమా వేశాలు పెడు తామ ంటే సహిం చేదిలేదన్నారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. సాయం త్రం వరకు అధికారులు గ్రామంలో ఖాళీగా ఉండి వెనుదిరిగారు.