Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలుగు మీడియంతో పాటు ఆ మీడియం అధ్యాపక పోస్టులను ఎత్తివేయడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యూజీసీ నిబంధనల ప్రకారం అధ్యాపక, విద్యార్థుల నిష్పత్తి 1:25లుగా ఉండాలనీ కానీ సైన్స్లో 60మంది, ఆర్ట్స్లో 70మంది విద్యార్థులకు ఒక్కొక్క అధ్యాపకుడు ఉండాలనే నిర్ణయం సరికాదని తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఒకే అధ్యాపకుడు బోధన చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.