Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారంపై సర్వే నిర్వహిస్తాం : జోగు రామన్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నినాదాన్ని కచ్చితంగా అమల్లో పెట్టాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను ఆదేశించారు. నాలుగో విడత హరితహారంపై శుక్రవారం మంత్రి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేండ్లుగా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ అనుభవంతో నాలుగో విడత కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని కోరారు. అన్ని జిల్లాల్లోని నర్సరీలో ఎత్తైన మొక్కలను నాటాలని, వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయనేదానిపై సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సారి పాఠశాల విద్యార్థుల నుంచి మొదలుకుని యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులను కోరారు. ప్రతి గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆగస్టు నెలాఖరు వరకు అటవీ శాఖలో ఉన్న ఖాళీ పోస్టునలు భర్తీ చేస్తామని చెప్పారు