Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల సీనియార్టీ జాబితాల్లో మళ్లీ తప్పులే వచ్చాయని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి చెన్నకేశవరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలకు అవకాశమిచ్చి న తర్వాతే వెబ్ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో 544 ఫిర్యాదులు వస్తే 200 పరిష్కరించారని, 344 సవరణ చేయలేదని తెలిపారు. మెట్పల్లిలో పనిచేస్తున్న జి పద్మావతి స్కూల్ సర్వీస్ పాయింట్లు 20.7, సర్వీసు పాయింట్లు 7.67, వంద శాతం ఫలితాల పాయింట్లు 2.5తో మొ త్తం 30.87 పొందాల్సి ఉండగా, 25.77గా చూపడం జరిగిందని పేర్కొన్నారు. లింగారెడ్డి ప్రిఫరెన్షియల్ కేటగిరీని వదులుకొని స్పౌజ్ పాయింట్లు పొందితే తిరిగి ప్రిఫరెన్షియల్ కేటగిరీలోనే ఉంచారని తెలిపారు.