Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో టూరిజం శాఖ పరిధిలో ఉన్న హోటళ్ల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మెన్ పి.భూపతిరెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్టీడీసీ హోటళ్లలో నూతన పద్ధతుల ద్వారా ఆదాయ మార్గాలు పెంచుకోవడం ప్రధాన ఎజెండాగా సమేవేశం జరిగిం దని ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమేవేశంలో టీఎస్టీడీసీ ఎండీ బి.మనోహర్, జనరల్ మేనేజర్ సురేందర్, జోరుదీప్, ఫైనాన్స్ ఏజీఎం కె నాథన్, ప్రవీణ్ సాగర్, మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.