Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 27న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కమర్ ఆలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 3నుంచి 20 వరకు మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్వహించామని తెలిపారు. వేతనాలు చెల్లించడం లేదని, పోరాడి పెంచుకున్న వేతనాలు కొన్ని మున్సిపాల్టీల్లో చెల్లించడం లేదని తమ దృష్టికొచ్చిందని వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ. 18వేలు చెల్లించాలని తెలిపారు.