Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగి ఉన్న లారీని ఢకొీట్టిన కారు
- మృతులంతా ఒకే కుటుంబం
నవతెలంగాణ-సుల్తానాబాద్/సుల్తానాబాద్ రూరల్
అతివేగం కుటుంబంలో విషాదం నింపింది. ఆగి ఉన్న లారీని కారు ఢ కొట్టడంతో ఒకే కుటుంబా నికి చెందిన నలుగురు అక్కడకక్కడే ప్రాణం కోల్పో యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం జరిగింది. పెద్దపల్లి డీసీపీ సుదర్శన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండల కేంద్రానికి చెందిన సీహెచ్ అరుణ్ కుమార్(37) మంథని పట్టణంలో ప్రయి వేటు పాఠశాల నిర్వహిస్తున్నాడు. అరుణ్ కుమార్ తన భార్య సౌమ్య, పిల్లలు అఖిలేష్(10), శాన్వి(8)తో కలిసి బావమరిది, తమ్ముడిని కాలేజీలో చేర్పిం చేందుకు గురువారం హైదరాబాద్ వెళ్లా రు. తిరిగొస్తుండగా అర్ధరాత్రి సుల్తానా బాద్ మండలం పూసాల రైస్మిల్లు శివారులో ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అరుణ్ కుమార్, సౌమ్య, శాన్వికు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు ఛిద్రమయ్యాయి. అఖిలేష్ను కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపో యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏసీపీ హబీబ్ ఖాన్, సీఐ రాములు, ఎస్ఐ రాజేష్, ఏఎస్ ఐ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. అరుణ్ కుమార్ ప్రయివేటు పాఠశాల డైరెక్టర్గా మంథనిలో పేరున్న వ్యక్తి కావడంతో అధిక సంఖ్యలో జనం తర లివచ్చారు. మం థని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్ద పల్లి మాజీ ఎమ్మె ల్యేలు బిరుదు రాజమల్లు, చింతకుంట విజయర మణా రావు, నాయకులు సురేష్రెడ్డి, సర్పంచ్ అన్న య్యగౌడ్, మంథని నుండి పలుపాఠశాలల యజమా నులు, విద్యార్థులు భారీ సంఖ్యలో ఆస్పత్రికి తరలివచ్చారు. అరుణ్ మృతికి సంతాపంగా మంథని ప్రయివేటు పాఠశాల లు బంద్ ప్రకటించాయి.