Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరాలోగా సూరమ్మ రిజర్వాయర్ : హరీశ్రావు
- మహిళా సంఘాల భవనాలకు నిధులు: ఈటల సభలోసాక్షరభారత్ కోఆర్డినేటర్ల నిరసన
నవతెలంగాణ- కథలాపూర్
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోనసీమగా మారుతుం దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్, మేడిపెల్లి మండలాల వరప్రధాయని సూరమ్మ చెరువు రిజర్వా యర్ నిర్మాణ పనులను కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గతంలో రూ.600 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించి కేవలం 5 టీఎంసీల నీరు ఉంచగలిగితే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నిధులు వెచ్చింది. 22 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పునర్నిర్మిం చామన్నారు. రూపొందించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఆపేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి ఉత్తరాలతో రాయబారం నడుపుతున్నారని ఆరోపించారు.
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని మహిళా సంఘ భవన నిర్మాణాలకు సత్వరమే నిధులు అందిస్తామని చెప్పారు. గతంలో ఆడబిడ్డ పుడితే తల్లిదండ్రులు భారంగా చూసేవారని, కానీ నేడు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన కళ్యాణలకిë పథకం ఆడపిల్లలకు ఎంతో భరోసానిస్తోందని అన్నారు. అయితే, ఈ సభలో తమకు న్యాయం చేయాలని సాక్షర భారత్ కోఆర్డినేటర్లు వర్షంలో తడుస్తూ నిల్చొని నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లకëణ్రావు, ఉమ్మడి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, రైతు సమన్వయ సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చీటి వెంక ట్రావు, తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి పాల్గొన్నారు.