Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్యకు శుక్రవారం గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. గుండెకు సంబంధించిన మూడు నాళాలు సక్రమంగా పనిచేయట్లేదని వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బైపాస్ సర్జరీ అవసరం రావచ్చని చెప్పారు. ప్రస్తుతం గుమ్మడి నర్సయ్య ఆరోగ్యం స్థిరంగానే ఉందని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మేయర్ పాపాలాల్ తదితరులు గుమ్మడిని పరామర్శించారు.