Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రతినిధి
2019 సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, తాను కీలక స్థానంలో ఉంటానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కనగల్లో శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 60ఏండ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరటం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైందని, తెలంగాణ కాలేదని విమర్శించారు. ఇరుకైన గదుల్లో ఉంటున్న వారికి డబుల్బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి రాష్ట్రసర్కారు మాటతప్పిందన్నారు. అసెంబ్లీలో ఎదుర్కునే దమ్ములేకనే తన సభ్యత్వం రద్దు చేశారని విమర్శించారు. న్యాయ స్థానం అక్షింతలు వేసినా ప్రభుత్వానికి బుద్ధిరాలేదన్నారు.