Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
నీటిని వృధా చేయకుండా పూర్తిస్థాయిలో వినియోగించుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నది. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవటానికి కూడా ఈ కమిటీ తగిన సూచనలు చేస్తుంది. వర్షాకాలంలో నీటి వినియోగానికి సంబంధించి ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యదర్శుల స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని రాష్ట్రాలూ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి కేంద్ర జలవనరుల శాఖకు పంపాల్సి ఉంటుంది. దీనిని తయారు చేసి అమలు చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చైర్మెన్గా పదిమంది అధికారులతో ఒక కమిటీని నియమించారు. అటవీ, నీటిపారుదల, పంచాయితీరాజ్, పురపాలక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, గ్రామీణాభివృద్ధి, ఆయకట్టు అభివృద్ధి ఉద్యాన వన శాఖ కమిషనర్లు, భూగర్భ జల శాఖ డైరెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.