Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేబ్రిడ్జి తూకాల్లో మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో తూనికలు, కొలతల శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలోని పలు వేబ్రిడ్జిలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జిలను సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేసింది. శనివారం రీజినల్ డిప్యూటీ కంట్రోలర్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగారెడ్డి జిల్లాలోని పతంగి వేబ్రిడ్జ్( ఆటోనగర్) జై హనుమాన్ వేబ్రిడ్జ్ ( కర్మన్ఘాట్) రామ ధర్మకాంట ( శంషాబాద్) గోల్డెన్ వేబ్రిడ్జ్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తించి సీజ్ చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల్లో 5, మేడ్చల్ 4, భూపాలపల్లిలో 3 కేసులు నమోదు చేశారు. జై హనుమాన్ వేబ్రిడ్జ్ తనిఖీల్లో వేబ్రిడ్జి యాజమాని, కంప్యూటర్ ఆపరేటర్, లారీ డ్రైవర్లు కుమ్మకైన విషయం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులు మరింత లోతుగా తనిఖీలు చేయడంతో వేబ్రిడ్జిలోని కంప్యూటర్లో ఎంత బరువు నమోదు చేస్తే అంత వేబ్రిడ్జి కాంటలో చూపించేటట్టుగా చేసిన మోసిన అధికారులు గుర్తించారు.