Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లుగా ఆయన టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు:
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''దానం నాగేందర్ పార్టీ మారతారనేది ముందే ఉహించిన విషయం. రెండేండ్లుగా ఆయన టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్లోకి వెళ్లడం కోసం ఫ్లెక్సీలు కూడా రెడీ చేసుకున్నారు. అప్పట్లో కేసీఆర్ వద్దు పొమ్మన్నారు...అయినా దానంకు పార్టీ మారడం కొత్తేం కాదు. గతంలో కూడా టీడీపీలోకి వెళ్ళి, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రి పదవి అనుభవించారు.ఇప్పుడు కాంగ్రెస్ లో బీసీ లకు న్యాయం జరగడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది. దానం సొంత ఎజెండా కోసమే పార్టీ మరారు. ఆయన పార్టీ మారడాన్ని నేతలు ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. ఆయన ఇంటికి పీసీసీ ప్రెసిడెంట్ వెళ్లడం కూడా కరెక్ట్ కాదు. దానంకు అంత స్థాయి లేదు.' కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఇవి. ''అసలు టిఆర్ఎస్ పార్టీలోనే సామాజిక న్యాయం లేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాని కేసీఆర్ మోసం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదు. ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్లో బీసీలకు ఆది నుంచి ప్రాధాన్యం ఉంది. భవిష్యత్లో రాష్ట్రంలో కాంగ్రెస్దే అధికారం. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన నేతలంతా అప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి వస్తామని బతిమిలాడటం ఖాయం'' అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
అన్యాయంపై పార్టీలో ఉండి కొట్లాడాలి-విహెచ్
రెడ్డి కులస్తులు బీసీలకు అన్యాయం చేస్తే...పార్టీలో ఉండి కొట్లాడాలి. అంతేకాని పార్టీ మారి..కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తోందని చెప్పడం సరికాదు. దానం నాగేందర్ పార్టీని వీడటం విచారకరం. ఏ హామీలు, ఒప్పందాలతో ఆయన పార్టీ మారాడో నాకైతే తెలీదు
టీఆర్ఎస్కు బీసీని అధ్యక్షుని చేస్తారా...పొంగులేటి
రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. దానం నాగేందర్ పార్టీలోనుండి బయటికి వెళ్లడం బాధాకరమని, బీసీలకు కాంగ్రెస్ పార్టీలోనే చాలా మేలు జరిగిందని అయితే జరగాల్సింది ,ఇంకా ఉందని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య,కేశవరావు, డి.శ్రీనివాస్,లాంటి నేతలు పీసీసీ పదవులు చేశారు. టీఆర్ఎస్పార్టీకి ఓ బీసీ నేతను అధ్యక్షుడిని చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.