Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కలెక్టరేట్
స్థానిక సంస్థల రిజర్వేషన్లలో బీసీ వర్గీకరణ అమలు చేయాలని ఎంబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అనంతరామన్ సిఫారసు వల్ల 1970లో రాష్ట్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ ఏబీసీడీ వర్గీకరణను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ విధానం అమల్లోకి రావడం వల్ల సంచార, అర్ధసంచార, సేవ, విముక్తి, వృత్తి, ఉత్పత్తి సామాజిక తరగతులకు అనేక అవకాశాలు లభించా యన్నారు. ఈ విధానాన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేస్తే ఎంబీసీ సామాజిక తరగతులందరికీ రాజ్యాధికారం వస్తుందన్నారు. వరీ ్గకరణ అమల్లో లేకపోవడంతో అల్పసంఖ్యాక సామాజిక తరగతుల వారు స్థానిక ఎన్నికలలో అవకాశానికి నోచుకోవట్లేదన్నారు.