Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జార్ఖండ్ రాష్ట్రంలో ఒక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు మహిళా కార్యకర్తలపై పత్థల్గడీ ఉద్యమకారులు సామూహిక లైంగిక దాడి రానికి పాల్పడటాన్ని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్య వేదిక (టీ మాస్ ఫోరం) ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన 15 ఏండ్ల బాలికపై పది మంది గ్యాంగ్ రేప్ చేయ టం అత్యంత దారుణమని ఫోరం రాష్ట్ర చైర్మెన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య, రాష్ట్ర కన్వీనర్ జాన్వెస్లీ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.