Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1995 సమీక్ష, మార్పు కోసం.. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించాలి: సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఈపీఎస్ 1995 స్కీమును సమీక్ష చేసి మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందనీ, మార్పులు తీసుకొచ్చే ముందు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ను సీఐటీయూ రాష్ట్ర కమిటీ కోరింది. ఈమేరకు శనివారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం సాయిబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈపీఎస్పై త్రైపాక్షిక నిర్ణయాలను అమలు పర్చడంలో అధికారులు తిరస్కరణ ధోరణిని వ్యక్తపరుస్తున్నారని, త్రైపాక్షిక నిర్ణయాలను అపహాస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. నిర్ణయాల అమలులో విశ్వసనీయత ఉండాలనీ, త్వరలో ఖచ్చితమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈపీఎస్ స్కీము ప్రారంభించినప్పుడు చెప్పిన ప్రయోజనాలను నేటికీ అమలు చేయడం లేదని లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి కార్మికుని ఆఖరు నెలలో పొందిన జీతం ఆధారంగా పింఛన్ లెక్కగట్టాలని కోరారు.