Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని ఏఐసీబీసీడబ్ల్యూ జాతీయ అధ్యక్షులు విజయన్ కున్శేరి ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మిక శక్తిలో 93 శాతం ఈ రంగంలోనే ఉన్నారని వారికి భద్రత, పెన్షన్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ తదితర సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలిండియా కాన్ఫడరేషన్ ఆఫ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ (ఏఐసీబీసీడబ్ల్యూ) జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో జరిగింది. విజయన్ కునిశేరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో నిర్మాణం రంగంలో పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తున్నదని మండిపడ్డారు. ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రవి మాట్లాడుతూ నిర్మాణ పనుల నుండి రెండు శాతం సెస్సు వసూలు చేసి కార్మిక సంక్షేమానికి ఖర్చు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి పథకం నిధులను తగ్గిస్తూ నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. కనీస పింఛన్ రూ.6 వేలు, ప్రమాద భీమాను రూ.10 లక్షలకు పెంచాలన్నారు. సమావేశంలో ఏఐటీయూసీ జాతీయ ఉఫాధ్యక్షులు టి. నరసింహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్రావు, వివిధ రాష్ట్రాల నాయకులుబాసుదేవ్గుప్తా (పశ్చిమ బెంగాల్, నారాయణ్ పుర్బే (బీహార్), శివన్న (కర్నాటక), విద్యాధర్ మహాంతో (ఒడిస్సా, చంద్రశేఖర్ (పాండిచ్చేరి), వెంకటసుబ్బయ్య (ఆంధ్రప్రదేశ్), సెల్వరాజ్ (తమిళనాడు), శంకర్ పూజారి (మహారాష్ట్ర) ప్రవీణ్కుమార్, మునిస్వామి, ఉమేష్, పడాల రమణ తదితరులు పాల్గొన్నారు.