Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు పిల్.. ప్రతివాదులకు నోటీసు
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ప్రారంభించిన రైతుబంధు పథకాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికి వర్తింపజేయరాదని పేర్కొంటూ అందిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా (పిల్) హైకోర్టు పరిగణించింది. నల్లగొండ జిల్లా నుంచి లాయర్ యాదగిరిరెడ్డి రాసిన లేఖను న్యాయ మూర్తుల కమిటీ పిల్గా మల్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఒక ఎకరం భూమికి రూ.నాలుగు వేలు చొప్పున భూయజమానికి అందజేస్తున్న విషయం విదితమే. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రవాస భారతీయులు, పెన్షన్ పొందుతున్న రిటైర్డు ఉద్యోగులకు ఈ పథకం అమలు చేయరాదని లేఖలో యాదగిరిరెడ్డి హైకోర్టును కోరారు. ఈసా యం రైతులకు మాత్రమే అందజేయాలి. ఇలా ఆర్థిక సాయం అందుకున్న రైతులు ఏవిధమైన పంటలు పండించారో లిఖితపూర్వకంగా వివరాలను అఫిడవిట్ రూపంలో సేకరించాలి. దీని వల్ల సాయం ఏమేరకు ఉపయోగ పడిందో తెలుస్తుంది. అందరికీ ఎకరాకు రూ.4 వేలు చెల్లిస్తే ఆర్థికంగా ఉన్నత స్థితిలోని వారికి కూడా అవసరం లేకపోయినా ప్రజాధానాన్ని ఇచ్చినట్లు అవుతోంది. అవసరమైన వారికి మాత్రమే ఆర్థిక సాయం అందిస్తే ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టినట్లు అవుతుంది. అర్హులైన రైతులకు మాత్రమే సాయం అందేలా చేయాలి. దుబరాను అడ్డుకోవాలి.. అని రాసిన లేఖను హైకోర్టు పిల్గా పరిగణించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు ప్రతివాదులుగా ఉన్నారు. ఈ పిల్ 26న విచారణకు వచ్చే అవకాశముంది.