Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
- ఢిల్లీలో ఇండియాటుడే అవార్డు స్వీకరణ
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
రైతుబంధు చెక్కు ల్లో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వ్యవ సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి సైతం వెళ్లిందని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. ఇందుకోసం అనేక రాయితీలు, పథకాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. వ్యవసాయరంగంలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు ఇండియాటుడే అవార్డు దక్కింది. ఈ అవార్డును శనివారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్ చేతులమీదుగా పోచారం శ్రీనివాసరెడ్డి అందుకున్నారు. అంతకముందు తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తాసుఖేందర్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు, నీళ్లు ఇవ్వకుండా తెలంగాణ వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 23 లక్షల మోటార్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, గోదావరి-కృష్ణా నదీ జలాలను కోటీ ఎకరాలకు అందించేందుకు కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తున్నట్టు చెప్పారు. యేడాదిలోగా కోటీ ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. అలాగే 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ. ఎనిమిది వేల చొప్పున పంటపెట్టుబడి సాయం చేస్తున్నామని వివరించారు. ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం కింద రైతులకు బాండ్లు అందజేయనున్నట్టు చెప్పారు.