Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఓటుపై చైతన్యం కల్పించేందుకు ఆగస్టు మాసంలో ఓటు చైతన్య సదస్సులు నిర్వహించాలని టీ మాస్ చైర్మెన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య షఫర్డ్ చెప్పారు. ఆదివారం ఎస్వీకేలో నిర్వహించిన టీ మాస్ రాష్ట్ర కమిటి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫూలే,అంబేద్కర్, మార్స్క్ సిద్ధాంతాల పునాదిగా బహుజన రాజ్యాధికారం కోసం 93శాతం ప్రజలు ఐక్యంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలపై క్షేత్రస్థాయిలో ఓటు చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 93శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలేవీ నెరవేర్చలేదని, వీరంతా బహుజన రాజ్యం కోసం తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూలై మాసంలో అన్ని జిల్లాల్లో సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి, బహుజనులకు అధికారం ఓటరు పాత్ర అనే అంశాలపై అన్ని సంఘాలు, సంస్థలు, మేధావులతో సమావేశాలు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజక వర్గాలు, మండలస్థాయి సదస్సులు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో టీమాస్ కన్వీనర్ జాన్వెస్లీ, స్టీరింగ్ కమిటి సభ్యులు శ్రీరాంనాయక్, రాంచంద్రయ్య, కిల్లెగోపాల్, స్కైలాబ్బాబు, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.