Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదం అంచున మునిగిపోయిన ఓడలు, విలువైన వస్తువులు
- చెక్క, ఉక్కు నిర్మిత ఓడలను.. రహస్య సమాచారాన్ని నాశనం చేస్తున్న సూక్ష్మజీవులు
- మునిగిన ఓడల ఆఖరి మజిలీ, చారిత్రక రహస్యాలు సమాధి కావాల్సిందేనా?
- టైటానిక్ ఒక్కటే కాదు.. కర్పాథియా, జర్మన్ ఓడ, ఫిలిప్పీన్స్ నౌకలు కూడా!
- చింతపల్లి సముద్ర జలాల్లో కనిపించిన మినీ టైటానిక్..
- మరి కొన్నేండ్లలో పూర్తిగా శిథిలమయ్యే అవకాశం?
సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా మౌన రోదన చేస్తున్న ఎన్నో ఓడలు.. తమ ఆఖరి మజిలీలో ఏం జరిగిందో నేటి ప్రపంచానికి చెప్పడానికి ఆరాటపడుతున్నాయి. ఐతే, కాలమనే సర్ప కాటుకు శల్యమై.. 'నీటి చరిత్ర'లో కలిసిపోతామనే బెంగ.. ఇప్పుడు వాటిని పట్టి పీడిస్తోంది. ఆ నేపథ్యంపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
* జై
ఆధునిక చరిత్రలో అతిపెద్ద సముద్ర విపత్తుగా పేర్కొనే టైటానిక్ ఓడ ప్రమాదం.. 1912 ఏప్రిల్ 15వ తేదీన అట్లాంటిక్ మహా సముద్రంలో జరిగింది. ఐస్బర్గ్ను ఢకొీట్టడం మూలంగా జలసమాధి అయిన ఆ పడవ భాగాలు(ఇనుప బాడీ) ఇప్పటికీ సముద్రం అడుగున ఉన్నప్పటికీ, అవి త్వరలో అంతరించిపోయే దశకు వచ్చాయని.. తుప్పుపట్టిన ఇనుప బాడీని సూక్ష్మజీవులు తినేస్తుండటం మూలంగా 2030లోపు సదరు నౌకకు సంబంధించిన ఆయా అవశేషాలు పూర్తిగా కనుమరుగు కావొచ్చునని హాలిఫాక్స్లోని డల్హౌసీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పడాన్ని చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఐతే, వివిధ మాధ్యమాల వల్ల అందరికీ సుపరిచితమైన టైటానిక్ ఓడ ఉదంతాన్ని తలదన్నే ఎన్నో పెను ప్రమాదాలు ఇప్పటికీ పూర్తిగా వెలుగులోకి రాలేకపోయాయి. సదరు ప్రమాదాల్లో జరిగిన కోట్లాది ఆస్తి, వేలాది ప్రాణ నష్టం, దేశాల మధ్య రహస్య ఒప్పందాలకు సంబంధించిన సమాచారం, ఇంధన మర్మాలు, చారిత్రక సంపద తదితర అమూల్య సమాచారం ఇప్పుడు సాగర గర్భంలో కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అంతెందుకు? టైటానిక్ ప్రమాదం జరిగాక.. సముద్ర జలాల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సుమారు 705 మంది ప్రయాణికులను కాపాడిన కర్పాథియా ఓడ తర్వాతి కాలంలో ఏమైందో చాలా మందికి తెలియదు. 1918, జూలై 17న ఐర్లాండ్ సముద్ర జలాల్లో ప్రయాణం సాగిస్తున్న కర్పాథియా నౌకపై జర్మన్ సబ్మెరైన్లు టార్పెడోలు(మిసైల్స్) ప్రయోగించడంతో సదరు ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఆ ఓడతో పాటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వివిధ దేశాల మధ్య జరిగిన పలు రహస్య ఒప్పందాలు, విలువైన వస్తువులు సాగర జలాల్లో ఉండిపోయినట్టు పలువురి వాదన. ఇప్పుడు సముద్ర సూక్ష్మజీవుల మూలంగా అట్టి సమాచారం, ఓడ శకలాలు నాశనమయ్యే పరిస్థితి వచ్చింది.
మన టైటానిక్ పరిస్థితి?
ప్రాచుర్యం వల్ల టైటానిక్ ఓడ ప్రమాదమే అతి పెద్దదిగా అనుకుంటున్నాం గానీ, ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత భయానక ఓడ ప్రమాదంగా బాల్టిక్ సముద్రంలో మునిగిపోయిన జర్మన్ నౌక విషాదాన్నే పరిగణించాలి. రెండో ప్రపంచ యుద్ద సమయంలో 1945 జనవరి మాసంలో.. యుద్ద కార్యక్రమాల్లో భాగంగా జరిగిన మూడు టార్పెడో(మిసైల్) దాడుల మూలంగా సదరు ఓడలో ఉన్న సుమారు 9,400మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, రెండో ప్రపంచ యుద్దంలో యాక్టివ్గా ఉన్న పలు దేశాల రహస్య సమాచారం షిప్ తో పాటు బాల్టిక్ సముద్ర జలాల్లో ఇప్పటికీ బయటి ప్రపంచానికి ఏదో చెప్పాలని ఎదురుచూస్తోందని చరిత్రకారులు అంటున్నారు. ఎక్కడి వరకో ఎందుకు? ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివ ద్ధి సంస్థ(ఏపీటీడీసీ) సూచనతో విజయనగరం జిల్లా చింతపల్లి ప్రాంతం బర్రిపేటకు 12 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లోకి వెళ్ళిన స్కూబా డైవర్లకు ఓ పురాతన ఓడ కనిపించినట్టుగా చెబుతున్నారు. లైవ్ఇన్ అడ్వెంచర్స్ సంస్థ సారథ్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వెలుగుచూసిన ఓడ సుమారు 150 మీటర్ల పొడవుండి(టైటానిక్ ఓడ పొడవుకు సగం కంటే ఎక్కువ) వందేండ్ల నాటి పురాతనమైనదిగా భావిస్తున్నారు. అమెరికా సముద్ర ఇంధన నిర్వహణ బ్యూరో శాస్త్రవేత్తలు మరియు హాలిఫాక్స్లోని డల్హౌసీ యూనివర్సిటీ సైంటిస్టుల పరిశోధనల ప్రకారం.. సముద్ర గర్భంలో కూరుకుపోయిన పడవలపై ఆయా ఓడ నిర్మిత సామగ్రిని అనుసరించి సూక్ష్మజీవులు సదరు నౌకలను నాశనం చేస్తాయని.. టైటానిక్ విషయాన్ని అనుసరించి చూస్తే.. నూరు నుంచి నూట యాభై సంవత్సరాల క్రితం మునిగిపోయిన.. సెల్యూలోజ్, హెమీ సెల్యూలోజ్, లిగ్నిన్లతో తయారయ్యే చెక్క నిర్మిత ఓడలు, ఉక్కు పడవలు ప్రస్తుతం సాగర గర్భాల్లో కనుమరుగయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అంటే, మొదటి ప్రపంచ యుద్దం నుంచి ఇప్పటి వరకూ జరిగిన పలు ఓడల ప్రమాద నేపథ్యాన్ని తెలుసుకొని, ఆయా విపత్తు వెనకాల ఉన్న మర్మం, విలువైన సమాచారం తెలుసుకోవాలంటే ఆయా పరిశోధనలకు ఇదే సరైన సమయమని.. లేకపోతే, భవిష్యత్తులో ఆయా ఓడల చరిత్ర, ప్రమాదం వెనకున్న అసలు కారణాలు నీటి పాలు కావలసిందేనని మెరైన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చరిత్ర మరువని కొన్ని భయానక ఓడ ప్రమాదాలు
-1945 జనవరి మాసంలో.. యుద్ద కార్యక్రమాల్లో భాగంగా జరిగిన మూడు టార్పెడోల(మిసైల్) దాడుల వల్ల ఓ జర్మన్ ఓడ బాల్టిక్ సముద్రంలో ముని గిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 9,400 మంది ప్రాణాలు కోల్పోయారు.
- డిసెంబర్ 20, 1987లో ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ ప్రయాణికుల ఓడ.. ఆయిల్ ట్యాంకర్ ను ఢకొీట్టడం మూలంగా సుమారు 4,375 మంది ప్రా ణాలు వదిలారు. ప్రమాదం రాత్రి పూట జరగడం.. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటం మూలంగానే మ తుల సంఖ్య పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.
- ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్తున్న ఓ ఓడ జర్మనీకి చెందిన టార్పెడో తాకిడికి ఐర్లాండ్ సముద్ర జలాల్లో కేవలం 18నిమిషాల్లోనే మునిగిపో యింది. ఈ ప్రమాదంలో 1,198 మంది చనిపోగా.. 761 ప్రయాణికులు ఎలాగోలా ప్రాణాల్ని రక్షించు కోగలిగారు.