Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతురుణవిమోచన కమిషన్కు చైర్మెన్ వేయాలని పిటిషన్
- కమిషన్ చైర్మెన్ నియామకంతో కేసు మూసివేత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ విమోచన కమిషన్కు చైర్మెన్ను నియమిం చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ హైకోర్టుకు తెలియజేశారు. కమిషన్ చైర్మెన్గా నాగుర్ల వెంకటేశ్వర్లును నియమించినట్లుగా జీవో ప్రతిని హైకోర్టుకు అందజేశారు. దాంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసు విచారణకు తెర పడింది. కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయలేదు. దాంతో ఆయన ప్రభుత్వంపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. దీనిని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి రమేష్రంగనాథన్లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటైం దేగానీ దానికి చైర్మెన్ను నియమించకపోవడం కోర్టు ధిక్కారమని పిటిషనర్ వాదన. అయితే చైర్మెన్ నియాకమం కూడా జరిగిందని ప్రభుత్వ లాయర్ చెప్పడంతో వ్యాజ్యంపై విచారణ ముగిస్తున్నట్టు బెంచ్ ప్రకటించింది