Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
ఒక నిందితుడికి బెయిల్ ఇప్పించడానికి గాను పది వేల రూపా యలు లంచం తీసుకున్న రంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసి క్యూటర్ (ఏపీపీ) శ్రీరాంరెడ్డి అవినీతి నిరోధక శాఖకు సోమవారం పట్టుబ డ్డాడు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ జె.పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం వరకట్నపు వేధింపుల కేసులో అల్వాల్ పోలీసులు అరెస్టు చేసిన ఒక వ్యక్తికి బెయిల్ లభించేలా చూడాలని ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా స్పెషల్ సెషన్స్ కోర్టు ఏపీపీ శ్రీరాంరెడ్డిని నిందితుడి తరపు న్యాయ వాది ఇంద్రకుమార్ కోరాడు. అందుకు పది వేల రూపాయలు ఇవ్వాలని ఏపీపీ డిమాండ్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఎల్బీనగర్లోని అతని కార్యాలయం వద్ద కాపు కాసి లంచం తీసుకుంటుండగా ఏపీపీని రెడ్ హాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి పది వేల రూపాయలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీరాంరెడ్డిని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యూడిషియల్ రిమాండ్కు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.