Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాల్
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
నల్లగొండ కాంగ్రెస్ నేతలు తమ ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమా..? అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పి శేఖర్రెడ్డి, భాస్కర్రావు సవాల్ విసిరారు. నల్లగొండలో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటాన్ని ఖండి స్తున్నట్టు చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. సుశీ కంపెనీకి గతంలో మాదిరి లబ్ధి చేకూర్చడం లేదనే కోమటిరెడ్డి కుటుంబం కేసీఆర్పై కక్షపెంచుకున్నదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని నవాజ్షరీఫ్ కుటుంబంతో పోల్చి కోమటిరెడ్డి తన పిచ్చితనాన్ని చాటుకున్నారని ఎద్దెవా చేశారు. నల్లగొండ జిల్లాను రూ.35వేల కోట్లతో అభివృద్ధి చేసినట్టు వారు చెప్పారు. తెలంగాణ ఉద్య మంలో దొంగలకు, ఉద్యమ ద్రోహులకు సద్దులు మోసిన చరిత్ర నల్ల గొండ కాంగ్రెస్ నేతలకుందని విమర్శించారు. కోమటిరెడ్డి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు.