Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్యూ నేతల వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సకల జనుల సమ్మె కాలానికి వేతనంతో కూడిన సెలవును ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు టీఎమ్యూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి తెలిపారు. సోమవారం రవాణాశాఖమంత్రి పి మహేందర్రెడ్డి తన శాఖ పరిధిలో హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ ఇంఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం నాయక్, శివకుమార్, కొమురయ్యతోపాటు గుర్తింపు కార్మిక సంఘం టీఎమ్యూ కార్యనిర్వాహకఅధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు థామస్రెడ్డి, అశ్వత్ధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్నిగతంకంటే భిన్నంగా ఎలా కొనసాగించాలనే అంశంపై చర్చించిన అనంతరం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిశీలించారు. సకలజనుల సమ్మెకు వేతనాన్ని జులై నెల జీతంతో (ఆగస్టులో వచ్చే వేతనం) ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి డీఏ బకాయిలను ఆగస్టులో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్టు టీఎమ్యూ నేతలు తెలిపారు. సీసీఎస్ క్రింద యాజమాన్యం రూ.280 కోట్టు ఇవ్వాల్సి ఉండగా... ప్రస్తుతం రూ.45 కోట్లు ఇస్తామని, పదవీవిరమణ చేసిన ఉద్యోగుల కోసం రూ.20 కోట్లను ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16 శాతం మధ్యంతర భృతి కూడా జులై నెల జీతంతో (ఆగస్టు వేతనంలో) ఇస్తారని తెలిపారు.