Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల వేధింపులే కారణం:కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
విధుల్లో పని ఒత్తిడి, అధికారుల వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... మండల పరిధిలోని నారాయణరావుపేట వీఆర్వోగా రేసు ఆదినారాయణ రెండేండ్లుగా పని చేస్తున్నాడు. రైతుబంధు, భూ ప్రక్షాళన పనుల్లో క్షణం తీరికలేకుండా ఉండటం వల్ల కొంత అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో సాదాబైనామా, పహాణి, 1-బి వంటి రికార్డులను సకాలంలో పూర్తి చేయలేదని ఏడుగురు వీఆర్వోలకు మెమో ఇవ్వడంతో పాటు నెల జీతం ఆపేశారు. వారిలో ఆదినారాయణ ఒకడు. దీంతో మనస్తాపానికి గురైన ఆదినారాయణ ఇంట్లో యాసిడ్ తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే భద్రాచలంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నాడు.