Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పొరేట్లకు విలువైన భూములెక్కడివి..
- అర్హులందరికీ 'డబుల్' మంజూరుచేయాలి: బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు బి.వెంకట్
- ఇండ్ల కోసం శంషాబాద్ తహసీల్ ఎదుట ధర్నా
నవతెలంగాణ- శంషాబాద్
'కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కంపెనీలకు ప్రభుత్వం విలువైన భూములను ఎలా కట్టబెడుతోంది.. అదే పేదలు డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటే ఎందుకు నిరాకరిస్తుంది' అని బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు బి.వెంకట్ ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ డబుల్బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ(ఎం), బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు బి.వెంకట్ మాట్లాడుతూ.. అందరికీ డబుల ్బెడ్రూమ్ కట్టిస్తామన్న ప్రభుత్వం ఎంత మందికి కట్టించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు అడగకుండానే బడ్జెట్ కేటాయిస్తున్న ముఖ్యమంత్రి ప్రజలకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. శంషాబాద్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ పేదలకు డబుల్బెడ్రూమ్ ఇండ్ల కోసం స్థలం దొరక్కపోవడం దురదృష్టకరమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటావార్పు చేసుకుని ఇక్కడే ఉంటామని హెచ్చరిం చారు. బీఎల్ఎఫ్ నాయకులు నాగరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ.. బీఎల్ఎఫ్ అధికా రంలోకొస్తే అన్ని వర్గాలకూ సమ న్యాయం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని, దరఖాస్తులన్నీ ఉన్నతాధికారులకు చేరవేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఇ.సత్యనారాయణరెడ్డి, బీఎల్ఎఫ్ నాయకులు ముక్తాల రేఖ, ఎన్.మల్లేష్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.