Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్లు అదుపుతప్పి ఏడుగురు మృతి
- ఆరుగురికి తీవ్రగాయాలు
- నల్లగొండ, సిద్ధిపేట జిల్లాలో ఘటనలు
నవతెలంగాణ-పెద్దవూర/కొమురవెల్లి
అతివేగం ఏడుగురి ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. వేర్వేరుచోట్ల అదుపుతప్పిన రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ, సిద్ధిపేట జిల్లాల్లో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన పోడుగు జయంత్, ఖానాపురం అజరు, సంతోశ్రెడ్డి, ముళ్లపూడి సందీప్, గుంటిక రాఘవేందర్లు ఆదివారం ఉదయం కారులో బాపట్ల బీచ్కు బయల్దేరారు. అక్కడ నుండి సాయంత్రం 7 గంటలకు తిరిగి నాగర్కర్నూల్కు బయల్దేరారు. అప్పటికే తెల్లవారుజాము 3 గంటల సమయం కావడంతో కారు వేగానికి తోడు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతుపేరు స్టేజీ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి చెట్టును ఢకొీట్టింది. ఘటనలో ఖానాపురం అజరు(22), పోడుగు జయంత్(21), సంతోశ్రెడ్డి(24)లకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు తరలించారు.
మరో ఘటనలో... యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండ మడుగు గ్రామానికి చెందిన బాలరాజు (20), విష్ణు(19) మరో ఆరుగురి స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చారు. సోమవారం ఉదయం అందరూ కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కారు వేగమెక్కువగా ఉండడంతో ఆలయ స్వాగత తోరణం దాటి కొంత దూరం రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. బాలరాజు, విష్ణు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.