Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదేశాలు జారీ చేసిన డీజీ వీకే సింగ్
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
జైళ్ల శాఖ పెట్రోల్ బంకుల్లో ఇకపై హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ పోస్తారని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వీకే సింగ్ మంగళవారం ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు మరణించడానికి చాలా వరకు హెల్మెట్ ధరించక పోవడమేనని కారణమని తేలినట్టు ఆయన పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్న తమ శాఖ... ఈ హెల్మెట్ల విషయంలోనూ ద్విచక్ర వాహనదారులలో చైతన్య కల్పించడానికి కార్యక్రమాలను చేపడుతున్నదని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న తమ పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నామని చెప్పారు. అలాగే హెల్మెట్ను ధరించిన వారికే పెట్రోల్ పోసే విధంగా ఆదేశాలు జారీ చేశామని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.