Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ చెరుపల్లి
- గ్రామీణ బ్యాంకు ఎదుట బీఎల్ఎఫ్, సీపీఐ(ఎం) ధర్నా
- డిపాజిటర్ల సొమ్ము ఇస్తామని బ్యాంకు మేనేజర్ హామీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన రూ.9.6 కోట్ల కుంభకోణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. బ్యాంకు కుంభకోణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఎల్ఎఫ్, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భూపాల్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సంద ర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. ఈ కుంభకోణంపై ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం దారుణ మన్నారు. ఇండ్లు, భూములు అమ్ముకొని 153 మంది పేదలు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారని చెప్పారు. డిపాజిటర్ల సొమ్ము రికార్డుల్లో తక్కువ చూపించిన బ్యాంకు సిబ్బంది, అప్పటి మేనేజర్లు సు మారు 9.6 కోట్లను కాజేశారన్నారు. డిపాజిట్దారుల డబ్బులు వడ్డీతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
భూపాల్, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, బీఎల్ఎఫ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ వేముల ఆనంద్కుమార్, కన్వీనర్లు మన్నారం నాగరాజు, ముక్తాల రేఖ మాట్లాడుతూ.. డిపాజిట్ దారులను నట్టేట ముంచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్యాంకు కుంభ కోణం గురించి జిల్లా మంత్రి, సీఎం కేసీఆర్కు తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం మేనేజర్ స్పందించి.. డిపాజిట్దారులకు తగిన న్యాయం చేస్తామని.. ఈ నెల 31 తర్వాత డిపాజిట్ల డబ్బులు అందజేస్తామని రాతపూర్వకంగా హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు మహేందర్, బీఎల్ఎఫ్ జిల్లా నాయకులు చంద్రమోహన్, చేవెళ్ల కన్వీనర్ టి.జంగయ్య, కో-కన్వీనర్ ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.