Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖసంచాలకులకు హర్షవర్ధన్రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మోడల్ స్కూల్, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్లు (సీఆర్టీ)ల బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు జి హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళ వారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టి విజరుకుమార్ను కలిసి వినతిపత్రం సమర్పిం చారు. 2012లో కొంత మంది, 2014లో మరి కొంత మంది టీచర్లు నియామకమయ్యారని తెలి పారు. అప్పటి నుంచి బదిలీల్లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని పేర్కొన్నారు. పది నుంచి 12 ఏండ్లుగా కేజీబీవీల్లో సీఆర్టీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీల కోసం ఎదురుచూస్తు న్నారని తెలిపారు. కొత్త సీఆర్టీలను నియమిస్తు న్నారని, సీనియర్ సీఆర్టీలకు బదిలీలు చేపట్టా లని కోరారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని సూచించారు.