Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరీష్తో రేషన్ సరుకులు
- ఆగస్టు 15 నుంచి అమల్లోకి
- సినిమా హాళ్లలో ఎంఆర్పీ ధరకే విక్రయాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పౌరసరఫరాల శాఖలో వినూత్న మా ర్పులు చేపట్టిన్నట్టు ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వినియోగదారులు ఎప్పుడు కోరితే అప్పుడు రేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్డు ఇచ్చిన వెంటనే బియం అందిస్తామన్నారు. పౌరసర ఫరాల శాఖ పనితీరుపై మంగళవారం ''ఎంసీఆర్ హెచ్ఆర్డీ'' లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ పెద్ద లాభదాయక శాఖ కాకపోయినప్పటికీ సమాజసేవలో ముందుండేలా కొత్త విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ మిషన్లు పని చేయకపోతే ఐరీష్ విధానంతో వినియోగదారులకు రేషన్ సరుకులు అందజేస్తామని వెల్లడించారు. ఈ విధానాన్ని ఆగస్టు 15 నుంచి అమలుపర్చనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కోటి ఎకరాల పంట నిలువకు సరిపడ గోదా ములను సిద్ధం చేసామని తెలిపారు. ఇదివరకే 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎంఆర్పీ ధరలకే విక్రయాలు
సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై ఉన్న ఎంఆర్పీ ధరలకే తిను బంఢారాలను విక్రయాలు చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ ఆదేశించారు. సాధారణ మార్కెట్లో విక్రయిస్తున్న తర హాల్లోనే సినిమా హాళ్లు,మల్టీ ప్లెక్స్లలో విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లలో వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధిక ధరకు వస్తువులను విక్రయిస్తున్న పలు సినిమా హాళ్లు, మల్టీపెక్ల్లపై ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసింది. ఈ అంశంపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో సినిమా, మల్టీపెక్ల్ యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకున్ సభర్వాల్ మాట్లాడుతూ ప్యాకేజీలలో లేని పాప్కార్న్, ఐస్క్రీమ్, వంటి వాటిని స్మాల్, మీడియం, బిగ్, జంబో పేరుతో విక్రయించడం చట్ట విరుద్దమ న్నారు. ప్రతి వస్తువుపై బరువు, పరిమాణం, కచ్చితంగా కనింపిచాలని తెలిపారు. వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారులకు విధిగా బిల్లులు అందజేయాలని తెలిపారు.