Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన ప్రముఖులు
నవతెలంగాణ-అమీర్పేట
హైదరాబాద్లోని బల్కం పేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం వైభవం గా జరిగింది. ప్రభుత్వం తరు పున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ సతీసమేతంగా హాజరై అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఐటీ మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిం చారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. అషాడమాసంలో జరిగే అమ్మవారి కల్యాణానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. కల్యాణానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు.