Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 45గొర్రెలు మృత్యువాత
నవతెలంగాణ-బిజినపల్లి
మేత కోసం పోతున్న గొర్రెల మందపై నుంచి లారీ దూసుకెళ్లడంతో 45 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజనపల్లి మండలం పాలెం వ్యవసాయ కళాశాల సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ ప్రదీప్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగనూరు గ్రామంలోని రాములు, కృష్ణయ్య, మాసయ్య, చిన్న య్య, స్వామి గొర్రెల మందను మేతకోసం తెల్లవారుజామున పాలెం నుంచి నాగర్కర్నూల్ వైపు తోలుకుపోతున్నారు. పాలెం వ్యవసాయ కళాశాల సమీపానికి రాగానే జడ్చర్ల నుంచి ఎరువుల లోడుతో నాగర్కర్నూల్ వైపు పోతున్న లారీ మందపైకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 45జీవాలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. అవి ప్రభుత్వం యాదవు లకు సబ్సిడీపై అందించిన గొర్రెలు. పంచనామా నిర్వహించి నివేదికను పైఅధికారులకు పంపనున్నట్టు పశువైద్యాధికారి డాక్టర్ బుచ్చమ్మ చెప్పారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మృతిచెందిన గొర్రెలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీనిచ్చారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున రూ.15వేలు సాయమందిం చారు. కేసు దర్యాప్తులో ఉంది.