Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడ్కరీకి హరీశ్రావు వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. మంగళవారం ఢిల్లీకి వచ్చిన హరీశ్రావు.. పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్గడ్కరీని కలిశారు. ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు చెప్పిన హరీశ్రావు.. అలాగే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు. కేంద్రం నుంచి వీలైనంత ఆర్థికసాయం అందజేస్తే ప్రాజెక్టు పనులు మరింత వేగంగా జరుగుతాయని వివరించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు రాష్ట్రానికి రావాలని కేంద్రమంత్రిని హరీశ్రావు ఆహ్వానించారు. కాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని గడ్కరీ చెప్పినట్టు హరీశ్రావు తెలిపారు. మంత్రి వెంట ఎంపీలు జితేందర్రెడ్డి, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులున్నారు.