Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్కు, పోడు సమస్యపై పార్లమెంట్లో నిలదీస్తాం
- ఉక్కుపై పాలకుల తప్పుడు నివేదికలు
- ప్రయివేటుతో కేసీఆర్ లాలూచీ : బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న ఐదు వేల మందితో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్ట నున్నట్టు ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలి పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెరుమాండ్ల జగన్నాథం భవనంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బయ్యారం గుట్ట నుంచి మహబూబా బాద్ గాంధీ పార్క్ వరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తామ న్నారు. సాయంత్రం 4గంటలకు ముగింపు సభ ఉంటుంద న్నారు. ఈ పాదయాత్రలో బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్య ప్రకాశ్, రాష్ట్ర కోకన్వీనర్ మద్దికాయల అశోక్ పాల్గొంటారని తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ చేతు లెత్తేసిన బీజేపీని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా పోడు రైతులను వేధిస్తున్న కేంద్ర, రాష్ట్ర విధానాలపైనా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం నాలుగేండ్లుగా సర్వేల పేరుతో కాలయాపన చేసిందన్నారు. చివరికి ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. మరునాడే ప్రధాని మోడీని కలిసిన కేసీఆర్ ఉక్కు పరిశ్రమపై ప్రస్తావించకపోవటం ఆ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శ నమన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను జిందాల్ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. దీనిలో భాగంగానే పాలకులు నాణ్యత లేదని అధికారులతో తప్పుడు నివేదికలు ఇప్పించారని చెప్పారు. గత ప్రభుత్వం రక్షణ స్టీల్ కంపెనీకి లక్షా 50 వేల ఎకరాలు దారాదత్తం చేసిందన్నారు. నాణ్యత లేకుంటే ఆ కంపెనీ ఎం దుకు ముందుకు వస్తుందని ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్, బొగ్గు, రవాణా మార్గాలు సమకూర్చి ప్రయివేటుకు దారాదత్తం చేయటానికి కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేయ కపోగా హరితహారం పేరుతో గిరిజన సంహారం చేస్తున్నా యని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజ నులకు ఇస్తామన్న మూడెకరాల పథకానికి భూమి దొరకడం లేదని సాకులు చెబుతోందనీ, భూమి దొరక్కుంటే ఎకరాకు రూ.5లక్షల చొప్పున రూ.15లక్షలు అర్హులైన దళిత గిరిజ నుల ఖాతాల్లో డిపాజిట్ చేయాలని అన్నారు. తెలంగాణలో విషజ్వరాలు విజృభిస్తున్నాయనీ, ప్రభుత్వం వెంటనే తండాలు, ఆదివాసీ గూడాలు, దళితవాడల్లో మొబైల్ వైద్య శిబిరాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం కోయ, లం బాడ తెగల మధ్య తగువులు పెట్టి చోద్యం చూస్తోందన్నారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్దమని, ఈఎన్నికలకు సీపీఐ (ఎం) వ్యతిరేకమని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, బీఎల్ఎఫ్ నాయకులు పోతినేని సుదర్శన్రావు, గునిగంటి రాజన్న పాల్గొన్నారు.