Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడ ప్రమాణం చేయడానికైనా సిద్ధమే..
- పార్టీ సభ్యత్వమే లేని వారికి చైర్పర్సన్ పదవి ఇచ్చారు : ఎమ్మెల్యే బిగాలపై టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు పోశెట్టి ఆరోపణలు
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా తనను రూ.50లక్షలు డిమాండ్ చేసిన మాట వాస్త వమేనని టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యులు ఏఎస్.పోశెట్టి అన్నారు. మంగళవారం నిజామాబాద్ ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని నగరంలోని కంఠేశ్వర్ దేవాలయం, గోల్హనుమాన్, కన్యక పరమేశ్వరి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా..? అని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. తనవి తప్పుడు ఆరోపణలే అయితే రాజ కీయ సన్యాసం చేస్తానని, ఎమ్మెల్యే వెంటే కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే అనుచరులు కమీషన్లు దండుకుంటున్నారని, అపార్ట్ట్మెంట్ల నిర్మాణంలో సుమారు రూ.50లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసమే నగరాభివృద్ధి పేర నాటకాలాడుతు న్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ను వీడేది లేదని చెప్పారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దివ్య, ఆమె భర్త దినేష్ కుమార్కు పార్టీలో సభ్యత్వం కూడా లేదని, అలాంటి వారికి పదవి కట్ట బెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డానన్నారు. తన నాయకత్వం లో చాలామంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారని, 26 మంది జడ్పీటీసీలను గెలిపించి జిల్లా పరిషత్ను కైవసం చేసుకున్నామని చెప్పారు. ఉద్యమాలు చేయని నాయకులు టీఆర్ఎస్లో చేరి దొడ్డిదారిలో పదవులు పొంది ఉద్యమకారులపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. సమావేశంలో ప్రవీణ్ తదితరులు ఉన్నారు.