Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లను బొందపెట్టాలి
- బతుకుల మార్పుకు బహుజన రాజ్యం రావాలి
- ఆడపిల్ల పుడితే రూ.50వేలు.. చదువుకు ప్రోత్పాహకం : బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
''ఓటు అంటే డబ్బు.. బిర్యాని ప్యాకెట్ కాదు.. ఓటు అంటే మన బతుకు.. మన సమస్యలు పట్టని టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లను రాబోయే ఎన్నికల్లో బొంద పెట్టాలి'' అని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని తార్నాక విజయ పూరి కాలనీ కమ్యూనిటీహాల్లో టీమాస్ ఆధ్వర్యంలో ''బహుజనులకు రాజ్యాధికారం - రాజ కీయ పార్టీల వైఖరి - ఎన్నికల సంస్కరణలు - ఓటరు పాత్ర'' అంశంపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్స్ నమూనా తప్ప నగరంలో ఎవరికీ ఇవ్వలేద న్నారు. ధనిక రాష్ట్రమంటూ చెప్పుకుంటున్న కేసీఆర్, కేటీఆర్లు ఆ డబ్బుల్ని ఎందుకు పేదలకు ఖర్చు చేయటం లేదని ప్రశ్నించారు. బీఎల్ఎఫ్ అధి కారంలోకి వస్తే పదెకరాల్లోపు ఉన్న రైతులు, కౌలు రైతులకు రైతుబంధు అమలు చేస్తామని చెప్పారు. గుడిసెవాసులకు 24 గంటల విద్యుత్ను ఉచితం గా ఇస్తామన్నారు. ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, ఆమె ఇంటర్ పాస్ అయితే రూ.50 వేలు, డిగ్రీ పాస్ అయితే రూ.లక్ష, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.2లక్షలు, ఇంజినీరింగ్ పాస్ అయితే రూ.5లక్షలు, డాక్టర్ చదువుకు రూ.25లక్షల చొప్పున అందజేస్తామని హామీనిచ్చారు. అన్ని కులాలకూ చట్టపరంగా రిజర్వేషన్లు అందజేస్తా మని, దాని కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం బీఎల్ఎఫ్ రాబోయే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. టీమాస్ స్టీరింగ్ కమిటీ నాయకులు విమలక్క మాట్లాడుతూ.. దొరపోకడల కేసీఆర్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. గోరక్షణ పేరుతో హత్యలు ఎంతో కాలం సాగవన్నారు. ఈ కార్యక్రమంలో సికిందరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బీఎల్ఎఫ్ ఇన్చార్జి డిజి.నర్సింహారావు టీమాస్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సహదేవ్, సీపీఐ(ఎం) సెంట్రల్ కమిటీ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్, బీఎల్ఎఫ్ సికింద్రాబాద్ కన్వీనర్ ఎం.వీరస్వామి, చంద్రన్న, సీపీఐ(ఎం) నేతలు ఎం.అజీమ్బాబు తదితరులు పాల్గొన్నారు.