Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీఐ నివేదికతో 150 మంది ఆందోళన
- ఫ్యాకల్టీలో 65 శాతం ఖాళీలు ?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదిలాబాద్లోని రాజీవ్గాంధీ ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను ఎంసీఐ పునరుద్ధరించకపోవడంతో అక్కడి వైద్య విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది జూన్ 5న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బృందం కళాశాలలో ప్రమాణాలను పరిశీలించేందుకు వచ్చింది. 22 లోపాలను గుర్తించి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో తమ భవితవ్యంపై విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. ప్రస్తుతం హౌజ్సర్జన్ పూర్తిచేసిన వారు త్వరలో జరిగే పీజీ పరీక్షలు రాయాలంటే రిమ్స్కు అనుమతి లభిస్తేనే హరయ్యేందుకు అర్హులు. అంతేకాకుండా 2019లో కొత్తగా ప్రవేశాలకు ఈ అనుమతితోనే ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి మొత్తం 3,350 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,250 ఉంటే ప్రయివేటులో 2,100 ఉన్నాయి. రిమ్స్ 150 సీట్లను కలిగి ఉంది. ఆయా కళాశాలల్లో ఆ సీట్లు కొనసాగాలంటే ఫ్యాకల్టీ, ఎక్విప్మెంట్, సౌకర్యాలు, మెయింటెనెన్స్, హాజరు శాతం వంటి ఇతరత్ర ప్రమాణాలు పాటించాల్సిందే. వీటిని పర్యవేక్షించేందుకు ప్రతి ఏడాది ఎంసీఐ తనిఖీలకు వస్తుంది. నిబంధనలు పాటించకపోతే లోపాలను ఎత్తిచూపుతుంది. సరిదిద్దుకునేందుకు కొంత సమయం ఇస్తుంది. అప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే పునరుద్ధరించేందుకు నిరాకరిస్తుంది. అదే ప్రస్తుతం ఆదిలాబాద్లోని రిమ్స్ విషయంలో తేటతెల్లమైంది. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. నెల వ్యవధిలో లోపాలు సరిదిద్దుకోకపోతే సీట్ల పునరుద్ధరణ ఉండదని అల్టిమేటం జారీచేసింది. అయితే, అధికారులు మాత్రం షరా మామూలుగానే గడువులోగా లోపాలను సరిచేస్తామని తేలిగ్గా చెబుతున్నారు. ఎంసీఐ తనిఖీలు నిరంతరం కొనసాగేవే అన్నట్టు లైట్గా తీసుకుంటున్నారు. ఈ వైద్య కళాశాలలో ఎంసీఐ రెండు దఫాలు తనిఖీ చేసి లోపాలు ఎత్తిచూపినా సరిచేయకపోవడం విమర్శలు వినిపిస్తున్నాయి. మరోసారి ఎంసీఐ తనిఖీలకు వస్తుంది.
కాగా, రిమ్స్లో ఎంసీఐ ప్రధానంగా 22 అంశాలపై లోపాలను ఎత్తిచూపింది. ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ల పోస్టులు 65 శాతం ఖాళీగా ఉన్నాయని నివేదికలో స్పష్టం చేసింది. ప్రధానంగా ప్రొఫెసర్ 14, అసోసియేట్ ప్రొఫెసర్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులు కలిపి 10 శాతం కంటే తక్కువ పోస్టులు ఖాళీగా ఉంటే ఎంసీఐ పెద్దగా పట్టించుకోదు. రిమ్స్లో 65 శాతం ఖాళీలు ఉన్నాయని పేర్కొనడం విశేషం. దీంతోపాటు వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), ఎంఐసీయూలను నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయలేదని పేర్కొంది. కనీస మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలు లేకుండా వైద్య కళాశాలను, ఆస్పత్రిని నిర్వహిస్తుండటంపై ఎంసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేడియాలజీ విభాగంలో ఎక్స్రేలు, ఇతర యూనిట్లను ఏర్పాటు చేయకుండానే వైద్య కళాశాలలను, ఆస్పత్రిని నిర్వహిస్తుండటం నిబంధనలకు విరుద్ధమని చివాట్లు పెట్టింది. అంతేకాకుండా బెడ్ ఆక్యుపెన్సీ కేవలం 52.97 శాతం మాత్రమే ఉంది. ఓపీడీ రిజిస్ట్రేషన్ కౌంటర్ కంప్యూటరైజ్డ్ చేయలేదు. ఓజీ కోసం ప్రత్యేక క్యాజువాలిటీ లేదు. సెంట్రల్ ఆక్సిజన్తోపాటు వాటిని పీల్చే పరికరాలు పనిచేయడం లేదు. అనాటమీలో రెండు మతదేహాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఎంసీఐ తనిఖీకి వచ్చిన రోజు ఆస్పత్రిలో పనిచేసే 14 మంది రెగ్యులర్ వైద్యులు హాజరుకాలేదు. దీంతో రెసిడెంట్ వైద్యుల విషయంలో పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నట్టు తెలియజేసింది. అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ అశోక్ ఆస్పత్రికి సంబంధించి కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ పోస్టు, వైద్య కళాశాలకు సంబంధించి డైరెక్టర్ పోస్టును తన ఆదీనంలో ఉంచుకోవడం ప్రధాన లోపంగా ఎత్తిచూపింది. అసోసియేట్ ప్రొఫెసర్గా ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్టు లేదని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, రిమ్స్లో డీన్ పోస్టు ప్రిన్సిపాల్ పోస్టుతో సమానం. అలాంటి పోస్టులో బయోకెమిస్ట్రీ విభాగంలో ఓ మహిళా ప్రొఫెసర్ కొనసాగుతున్నానే విషయం ఆ కళాశాలలోని సిబ్బందికే తెలియకపోవడం గమనార్హం. ఈ రహస్యాన్ని ఎంసీఐ తన నివేదికలో బట్టబయలు చేసింది. తమ తనిఖీలో డీన్ రెగ్యులర్గా విధులకు హాజరుకావడంలేదని గుర్తించింది. అనేక డిక్లరేషన్ ఫారాలపై డీన్ సంతకం చేయాల్సి ఉండగా, వాటిపై సంతకాలు లేవని పేర్కొంది. కళాశాలలో కొంత కాలంగా మెడికల్ సూపరింటెండెంట్గా, డైరెక్టర్గా, డీన్గా ఒక్కరే ఉన్నారనే ప్రచారం ఉంది. దీంతో ఈ పోస్టులో మరొకరు ఉన్నారనే విషయం ఎంసీఐ నివేదికతోనే తేటతెల్లమైంది. ఓ ప్రొఫెసర్ పోస్టులో ఇంతటి రహస్యాలు దాచిపెట్టడం వెనుక ఆంతర్యమేమిటోనని పలువురు గుసగు సలాడుతున్నారు. వీట న్నింటిని నెలరోజుల్లో రెక్టిఫికేషన్ చేసుకోవాలని ఎంసీఐ స్పష్టం చేసింది. అది జరుగుతుంతో లేదోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో
ఎంబీబీఎస్ సీట్లు ఇలా..
ఉస్మానియా 250
గాంధీ 200
కాకతీయ 200
సిద్దిపేట 150
నిజామాబాద్ 100
మహబూబ్నగర్ 150
రిమ్స్ 100
ఈఎస్ఐ 100
మొత్తం 1,250