Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు ఆదిలాబాద్ వాసుల మృతి
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
మహారాష్ట్రలోని ముకుడ్బంద్ సమీపంలో పెన్గంగా నదిలో నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్కు చెందిన షేక్ సోఫిల్(16), ఎమ్డి అర్షద్(17) మృతిచెందారు. టూటౌన్ సీఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. సుందరయ్య నగర్కు చెందిన ఆరుగురు యువకులు కలిసి పీరీల(మొహర్రం) సంబరాలు చూడటానికి మహారాష్ట్రలోని రాజురా గ్రామానికి వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణం సమయంలో ముకుడ్ బంద్ ప్రాంతంలో పెన్గంగా నది శివారు వద్ద నాటు పడవలో ఆరుగురు ఎక్కారు. పెన్గంగా మధ్యలోకి వెళ్లాక పడవ అదుపుతప్పి బోల్తాపడటం తో యువకులు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే నదిలో సోఫిల్, అర్షద్ మృతిచెందారు. అదే కాలనీకి చెందిన ఉమర్, ఇర్ఫాన్, మన్సూర్ ఖాన్, పర్వేజ్ను బయటకులాగి రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉమర్, ఇర్ఫాన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నది మధ్యలోకి వెళ్లి సెల్ఫీ తీసుకుందామనే ఆతృతే పడవ బోల్తా పడటానికి కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతిచెందిన షేక్ సోఫిల్ ఆదిలాబాద్ పట్టణంలోని హిందీ హైస్కూల్లో పదో తరగతి చదువుతుండగా, ఎండీ అర్షన్ నలందా కళాశాలలో ఇంటర్ అభ్యసిస్తున్నాడు.