Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చిన సమ్మె డిమాండ్ల కోసం ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహించ నున్నట్టు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు కమర్అలీ, పాలడుగు బాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధి బృందం గురు వారం సర్కారుకు సమ్మెనోటీసు ఇచ్చింది. జీఓ నెం.14 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లిం చాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సూచించారు. పీఎఫ్, ఈఎస్ఐ వర్తింపజేయడం తోపాటు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలన్నారు. ప్రమాద బీమా, హెల్త్కార్డులు, దహన సంస్కారాల ఖర్చులను రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచాలనే తదితర డిమాండ్లతో సమ్మె చేయనున్నట్టు తెలిపారు.