Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతితో రాష్ట్ర ఖజానా ఖాళీ
- గారడీ మాటలతో మోసం : మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి
నవతెలంగాణ- తెలకపల్లి
తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం కళకళలాడుతుంటే, నిరుపేదల కుటుంబాలు మాత్రం సమస్యలతో విలవిల్లాడుతున్నా యని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. నాగర్కర్నూల్ జిల్లా తెలక పల్లి మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనావృష్టితో రైతులు ఇబ్బం దులు ఎదుర్కొంటుంటే పట్టించుకోకుండా, ప్రజావ్యతిరేకత పెరుగుతుందనే భయం తోనే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో రూ.21వేల కోట్ల బిల్లులు చెల్లించలేని దుస్థితి ఏర్పడిం దన్నారు. ఇంటింటికీ తాగు నీరందిస్తామని హామీనిచ్చి నెరవేర్చలేదని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్లు అడిగే నైతికత లేదని అన్నారు. టీఆర్ఎస్ అసమర్థ ప్రభుత్వమని, దామోదర్రెడ్డికి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్, హరీశ్రావు నీటి పారుదల విషయంలో అసత్యపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఒకసారి ఆరున్నర లక్షల ఎకరాలు, మరోసారి తొమ్మిది లక్షల ఎకరాలకు సాగు నీరందిం చామంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. 2013లో కేఎల్ఐలో మూడు పంపులు ఏర్పాటు చేసి ఎల్లూరు రెయిన్బండ దగ్గర నీటిని విడుదల చేశామని తెలిపారు. ప్రాజెక్టు కాలువల వెంబడి తిరిగితే నీళ్లు రావని, మొదట ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలని, అది కేవలం 10శాతం మాత్రమే చేశారని చెప్పారు.
తాను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నందుకే ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్భా టంగా కార్యకర్తలకు విలువ ఇస్తున్నారని విమర్శించారు. ఆయా గ్రామాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా టీఆర్ఎస్ అవినీతిని ఎండగడుతున్నారని చెప్పారు. సమా వేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఏ.రాములు, వెంకటయ్యగౌడ్, ప్రకాష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.