Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రేమికులపై దాడులకు రాష్ట్రవ్యాప్త నిరసన
- నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు
నవతెలంగాణ-యంత్రాంగం
ప్రణయ్ హత్య, మాధవి, సందీప్లపై దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు జరిగాయి. ప్రణరు యాక్టు తేవాలని విద్యార్థులు ఓయూలో నినదించారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో కులదురహంకారుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పాల్గొన్నారు. ఏఐఎంఎస్ఎస్, ఏఐడీఎస్ఓ, ఏఐడీవైఓ సంఘాల ఆధ్వర్యంలో బషీరాబాద్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కులదురహంకార హత్యల నివారణ కోసం ప్రణరు యాక్టు తేవాలని డిమాండ్ చేస్తూ ఓయూలో ఎస్సీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలో ప్రణరు హత్యను నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రవినాయక్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఎమ్డి.అంజద్ పాల్గొన్నారు. నల్లగొండలో సుభాష్ విగ్రహం వద్ద పీడీఎస్యూ, సీపీఐ(ఎంఎల్), ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలకేంద్రంలో బీఎల్ఎఫ్, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, దళిత సంఘాల అధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.
వరంగల్లో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ అశోక్ జంక్షన్లో ర్యాలీ, నిరసన తెలిపారు. దళిత, గిరిజన విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేపట్టారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాశిబుగ్గ జంక్షన్లో రాస్తారోకో చేపట్టారు. ధర్మసాగర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. శాయంపేటలో రైతుసంఘాలు, ఏబీఎస్ఎఫ్, జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. మహబూబాబాద్లో కోర్టు సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర శ్రవణ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కేసముద్రం మండలంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు కంటిపూడి అరుణ్కుమార్, తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షులు వెంకన్న ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ధన్యా ఫాదర్ కొలంబో యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ తీశారు.