Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్పై టీఆర్ఎస్ నేతల విసుర్లు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఓటమి భయంతోనే కాంగ్రెస్పార్టీ ఎన్నికలంటే భయపడుతోందని టీఆర్ఎస్ ఎంపీ బి వినోద్కుమార్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. గురువారంనాడిక్కడి తెలంగాణ భవన్లో వేర్వేరుగా జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఓట్ల గల్లంతు పేరుతో కాంగ్రెస్ నాటకం ఆడుతోందని, దానిపై న్యాయస్థానంలో కేసులు వేసి ఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తోందని వారు ఆరోపించారు. వారెన్ని పిచ్చి చేష్టలు చేసినా, టీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఏస్ కలిసి ఏర్పాటు చేస్తున్న కూటమి అసమర్ధుల మహాకూటమి అని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే టీఆర్ఎస్ విజయాన్ని ఖరారు చేసేశారని, వారే ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.