Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓటర్ల నమోదు ప్రక్రియ, బోగస్ ఓట్ల తొలగింపు వేగంగా కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.రజత్ కుమార్ తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. చిరునామా మార్పునకు 25వ తేదీ వరకు సమయం ఇచ్చామని తెలిపారు. ఓటర్ నమోదు చాలా ఉత్సాహంగా చేస్తున్నాని వివరించారు. 17 లక్షల ఓట్లు కొత్తగా నమోదు చేసుకున్నారని తెలియజేశారు. యువత కూడా పెద్దఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేశారు. ఓటర్ల తొలగింపు పక్రియ కూడా జరుగుతున్నదని చెప్పారు. ఓటర్ నమోదుపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని, దీనికి మంచి స్పందన వస్తున్నదన్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం రూపొందించిన కొత్త ఈఆర్వోనెట్ పై అధికారులకు అవగాహన కల్పించామని గుర్తు చేశారు. దీని ద్వారా 100 శాతం నకిలీ ఓట్లను తొలిగిస్తున్నారన్నారని ప్రకటించారు. చనిపోయిన వారి ఓట్లను కూడా తొలిగిస్తున్నామని తెలిపారు. బోగస్ ఓట్ల ఏరివేత జరుగుతున్నదని, ఈవీఎంలు 23 జిల్లాలకు చేరుకున్నాయని, ఈ నెల 22 తేదీ వరకు అన్ని జిల్లాలకు వస్తాయని వివరించారు. బీఎల్ఓలు అందరిని అపాయింట్ చేస్తున్నాం. వారికి శిక్షణ కూడా ఇస్తున్నాం. ఎన్నికల అవగాహన కల్పించేందుకు మాస్టర్ ట్రైనింగ్ కోసం ఢిల్లీకి పంపిస్తున్నామని చెప్పారు. ఈఆర్వో నెట్ వచ్చాక బోగస్ ఓట్లు తగ్గాయి, ఫొటోలు, పేర్లు ఒకే విదంగా ఉన్న లక్షా యాభై వేల ఓట్లు గుర్తించాం. ఓటర్ నమోదు కోసం చాలా ప్రచారం చేశాం. మంచి ఫలితం వస్తుంది. పేర్లు చేర్చేందుకు కోసం కొంత సమయం కావాలి. 32,574 మంది బీఎల్ ఓలు ఉన్నారు. సీఈఓ సైట్ లో ఉన్న జాబితా తుది జాబితా. ప్రతిపక్ష పార్టీలకు నేను చెప్తున్న ఓట్ల తొలగింపు, చిరునామా మార్పు కోసం సమయం ఇచ్చామన్నారు. ఓటర్ నమోదు మాత్రం ఎన్నికల గడువు వరకు చేసుకోవచ్చన్నారు. మన రాష్ట్రంలో 52,100 ఈవీఎంలు, 39,470 వీవీ ఫ్యాట్లు అవసరమని వివరించారు. ఈవీఎంలలో ఓట్లు వేస్తే ఒకే పార్టీ కి పడుతున్నాయి అనేది సరైనది కాదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ వారు విస్త తంగా ప్రచారం కల్పించాలని సూచించారు. రాజకీయ పార్టీల ముందే మాక్ పోలింగ్ చేస్తాం. ఇది అంతా రికార్డింగ్ జరుగుతుంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఎన్ని ఓట్లు తీసుకోవాలి అని కొన్ని నియోజకవర్గంలోకి వాటిని పంపిస్తున్నాం. ప్రజలు, పార్టీల నాయకుల ముందే మాక్ పోలింగ్ చేస్తాం. ఈవీఎంల పనితీరు పై విస్త్రృతంగా ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు.