Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు వైద్యులచే శస్త్ర చికిత్సలు
- మాధవి ఆరోగ్య స్థితిపై ఎస్సీ కమిషన్ ఆరా
నవతెలంగాణ - అంబర్పేట
హైదరాబాద్లోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం జరిగిన కులదురహంకార దాడిలో తీవ్రంగా గాయపడ్డ మాధవి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కులాంతర వివాహం చేసుకుందనే కసితో మాధవి తండ్రి మనోహరాచారి కూతురు, అల్లుడిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మాధవి చేయి తెగిపోయింది. దవడ, చెవి భాగంలో తీవ్ర గాయమైంది. భార్యాభర్తలను సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికితనిమిత్తం సోవ ూజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. మాధవి మెడ, ఎడమ చేయి, కుడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. మెడ భాగం, చెవికి గురువారం ఆపరేషన్ చేసినట్టు చెప్పారు. 48 గంటల్లో ఆమె స్పృహలోకి వస్తుందన్నారు. పథకం ప్రకారమే దాడి : నవదీప్, కుటుంబ సభ్యులుపథకం ప్రకారమే తమపై మాధవి తండ్రి దాడి చేశాడని నవదీప్ ఆరోపించారు. దాడి విషయంపై ఆయన మీడియాతో మాట్లాడాడు. తాము ప్రేమించి పెండ్లి చేసుకున్నామని, ఇది మాధవి ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదన్నారు. ఎప్పటి నుంచో తమపై దాడి చేయడానికి మాధవి కుటుంబ సభ్యులు ప్రణాళికలు వేస్తున్నారని తెలిపారు. మాధవిని వదిలిపెట్టాలని తనను బెదిరించారని చెప్పారు. కానీ ఇంత దారుణంగా తమపై దాడి చేస్తారని అనుకోలేదన్నారు. తమపై దాడి చేసిన మాధవి తండ్రిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆరా తీసిన ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు ఆరాసోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధవిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గురువారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య స్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని చట్టాలున్నా దళితులపై దాడులు ఆగడం లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై సొంత కుటుంబ సభ్యులే దాడులకు పాల్పడడం ఆందోళన కల్గిస్తోందన్నారు.